Share News

Ukraine Russia War: ఊహించని దాడి.. ఏకంగా 40 యుద్ధ విమానాలు ధ్వంసం!

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:10 PM

రష్యాపై మెరుపు దాడులకు దిగింది ఉక్రెయిన్. ఆ దేశ వైమానిక స్థావరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున డ్రోన్లతో అటాక్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Ukraine Russia War: ఊహించని దాడి.. ఏకంగా 40 యుద్ధ విమానాలు ధ్వంసం!
Russia Ukraine War

రష్యా మీద ఊహించని రేంజ్‌లో దాడులకు తెగబడింది ఉక్రెయిన్. ఆ దేశంలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున డ్రోన్లతో అటాక్ చేసింది. తూర్పు సైబీరియా బోర్డర్‌లోని సైనిక స్థావరాలను టార్గెట్‌గా చేసుకున్న ఉక్రెయిన్.. సుదీర్ఘ దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న డ్రోన్లను ప్రయోగించింది. రష్యాపై ఉక్రెయిన్ ఈ స్థాయిలో దాడులకు తెగబడటం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ అటాక్‌ను రష్యాలోని ఇర్కుట్స్ గవర్నర్ కూడా ధ్రువీకరించారు. తమ మిలటరీ యూనిట్ ధ్వంసమైందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌కు చెందిన రిమోట్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ వల్ల ఈ విధ్వంసం జరిగిందని తెలిపారు. ఒలెన్యా, బెలయాతో పాటు మరో 4 మిలటరీ ఎయిర్‌బేస్‌ల మీద అటాక్స్ జరిగాయని ఇర్కుట్స్ గవర్నర్ పేర్కొన్నారు.


ఇదే మొదటిసారి..

ఉక్రెయిన్ దాడిలో 40కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని కీవ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లతో పాటు ఏ-50 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయని వినిపిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన అనంతరం ఇంత భారీ రేంజ్‌లో ఉక్రెయిన్ దాడులకు దిగడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ అటాక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ను చర్చలకు ఆహ్వానించింది రష్యా. ఇరు దేశాల నేతలు టర్కీలోని ఇస్తాంబుల్‌లో సోమవారం సమావేశం కావాలని కోరింది. ఈ ప్రతిపాదనలకు ఉక్రెయిన్ ఓకే చెప్పింది. మంత్రి రుస్టెమ్ ఉమెరోవ్ బృందం ఈ చర్చలకు హాజరవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 08:11 PM