Los Angeles Protests: లాస్ ఏంజిల్స్లో మూడోరోజు నిరసన.. వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:22 AM
అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (Los Angeles Protests) నగరం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తితో అక్కడి ప్రజలు రోడ్డెక్కి మూడోరోజు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు.

అమెరికా(America)లోని లాస్ ఏంజెల్స్ నగరంలో గత మూడు రోజులుగా ఆందోళనలు (Los Angeles Protests) జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలస దారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఇవి కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ, భద్రతా బలగాలతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ జైలు సమీపంలో ఆందోళన కారులను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ ఆందోళన ఎందుకు
ఈ ఆందోళనలకు ప్రధాన కారణం అమెరికా వలస అధికారులు (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) చేస్తున్న అరెస్టులు. రోజుకు దాదాపు 2,000 మందిని అరెస్టు చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3,000 మందిని అరెస్టు చేయడం. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకుని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. సిటీ హాల్ వద్ద ఒక సమావేశంలో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు.
పోలీసులు ఏమన్నారంటే..
ఈ హింసాత్మక సంఘటనల్లో ఆందోళనకారులు (Los Angeles Protests) పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరారని, సమావేశాలు చట్టవిరుద్ధమని పోలీసులు ప్రకటించారు. దీంతో టియర్ గ్యాస్ వినియోగించినట్లు చెప్పారు. కొందరు ఆందోళనకారులు నగరంలోని ఓ ప్రధాన రహదారిని మూసేసి, నడిచే కార్లకు నిప్పు పెట్టారని, ఇవి ఆదివారం రాత్రి జరిగాయని వెల్లడించారు.
ట్రంప్ రియాక్షన్
లాస్ ఏంజెల్స్ ఒక గొప్ప నగరం. కానీ ఇప్పుడు అక్రమ వలసదారులు, నేరస్థులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియోలో పేర్కొన్నారు. ఆర్డర్ను పునరుద్ధరించడానికి, డిపోర్టేషన్ (వలసదారులను బహిష్కరించడం) కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ సంస్థలకు ఆదేశించారు. కానీ, ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న గందరగోళ వలస అరెస్టులు అని న్యూసమ్ ఆరోపించారు. ఇది ఏ సభ్య దేశం ప్రవర్తించే తీరు కాదని ఆయన Xలో పేర్కొన్నారు.
శాంతి కోసం పిలుపు..
ఇదే సమయంలో లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ ప్రజలను శాంతియుతంగా ఉండాలని కోరారు. మన నగరం చాలా కష్టాలను ఎదుర్కుందని, ఇప్పుడు మనం శాంతిని కాపాడాలని ఆమె సిటీ హాల్లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ట్రంప్ జాతీయ గార్డ్ను మోహరించడం తప్పని, దాన్ని వెనక్కి పిలవాలని ఆమె గవర్నర్ న్యూసమ్తో ఏకీభవించారు. శాంతియుతంగా ఆందోళన చేయాలని, హింసకు పాల్పడవద్దని కోరారు. ఈ ఆందోళనలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ప్రజలు, పోలీసుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి:
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
ఐఎండీ అలర్ట్.. జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..