Share News

Israel-Palestine War: గాజాలో దారుణం.. రూ.5ల పార్లే జీ ప్యాకెట్.. రూ.2,342..

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:39 PM

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం సుమారు ఏడాదిన్నర నుంచి కొనసాగుతూనే ఉంది.మరో వైపు గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పది రూపాయలు విలువ చేసే వస్తువులకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మన దగ్గర రూ.5లు విలువ చేసే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో ఏకంగా రూ.2,400కి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా ..

Israel-Palestine War: గాజాలో దారుణం..  రూ.5ల పార్లే జీ ప్యాకెట్.. రూ.2,342..

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం (Israel-Palestine War) సుమారు ఏడాదిన్నర నుంచి కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆపేందుకు పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నా కూడా రెండు దేశాల మధ్య రాజీ మాత్రం కుదరడం లేదు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా, మరో వైపు గాజాలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పది రూపాయలు విలువ చేసే వస్తువులకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మన దగ్గర రూ.5లు విలువ చేసే పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో ఏకంగా రూ.2,400కి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా అనేక రకాల వస్తువుల ధరలు వందలు, వేలల్లోనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


గాజాకు (Gaza) చెందిన ఓ వ్యక్తి చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘చాలాసేపు వేచి ఉన్న తర్వాత నేను చివరకు ఈరోజు రవీఫ్‌కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నాను. వాటి ధర 1.5 యూరోల (రూ.147) నుంచి 24 యూరోలకు (రూ. 2,342) పెరిగినా.. పిల్లలకు ఇష్టం కాబట్టి తీసుకున్నా’.. అని చెబుతూ అతడు ఓ పోస్టు పెట్టాడు. దీంతో అక్కడి నిత్యావసర వస్తువుల ధరల అంశం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. గాజాలోకి నిత్యావసరాల సరఫరాలు ఇజ్రాయెల్‌ అడ్డుకోవడంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.


నెలల తరబడి కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులతో (Israeli Attacks) గాజాలోని చాలా మంది నిర్వాసితులయ్యారు. మరోవైపు గాజా ప్రజలందరూ ట్రక్కుల ద్వారా వచ్చే ఆహారం, ఇతర సాయంపైనే ఆధారపడ్డారు. అయితే ఇజ్రాయెల్ వాటిని ఆపేస్తుండడంతో పరిస్థితి దారుణంగా మారింది. మూడు నెలలకు పైగా సరిహద్దులు మూసేయడంతో గాజాలోని 20 లక్షల మంది ప్రజలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొన్ని నిత్యావసర సరుకులు మానవతా సహాయంగా ఉచితంగా గాజాకు సరఫరా చేస్తున్నారు. అయితే అవి కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. మిగతా సరుకులను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పార్లే జీ బిస్కెట్‌తో పాటు అనేక రకాల సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. వాటి ధరలను పరిశీలిస్తే..

పార్లే జీ బిస్కట్ ప్యాకెట్ : రూ.2,342

1 కిలో చక్కెర: రూ.4,914

1 లీటర్ వంట నూనె: రూ.4,177

1 కిలో బంగాళాదుంపలు: రూ.1,965

1 కిలో ఉల్లిపాయలు: రూ.4,423

1 కాఫీ కప్పు: రూ.1,800


అంతర్జాతీయ రెస్క్యూ కమిషన్‌ పంపిన 6.7 టన్నుల మందులు, వైద్య సరఫరాలకు సంబంధించిన వాహనాలను గాజా వెలుపలే నిలిపేశారు. వీటిని గాజాలోకి ఎప్పుడు అనుతిస్తారో తెలీని పరిస్థితి. మరోవైపు నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడం, మరోవైపు అందాల్సిన సహాయం నిలిచిపోవడంతో మళ్ళీ దాడులు మొదలవుతాయేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


ఇవీ చదవండి:

నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

ఖలిస్థానీ వేర్పాటు వాద పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 03:48 PM