Pak Missile Test: రెండోసారి క్షిపణి పరీక్ష నిర్వహించిన పాక్
ABN , Publish Date - May 05 , 2025 | 02:49 PM
పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గత శనివారం నుంచి ఇది రెండోసారి. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన 'అబ్దాలీ వెపన్ సిస్టమ్' అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారంనాడు పరీక్షించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇస్లామాబాద్: పహల్గాం దాడి అనంతరం కవ్వింపు చర్యలను పాకిస్థాన్ సైన్యం మరింత తీవ్రతరం చేస్తోంది. ఇండస్ పేరుతో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా 120 కిలోమీటర్ల రేంజ్ కలిగిన క్షిపణిని సోమవారంనాడు పరీక్షించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్ష విజయవంతమైనట్టు పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది.
Pakistan Russia Diplomacy: రష్యాను వేడుకున్న పాకిస్తాన్..భారత్తో చర్చించండి ప్లీజ్..
''క్షిపణి పరీక్షలో పాల్గొన్న బలగాలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడంలో పాక్ ఆర్మీ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్, సామర్థ్యంపై పూర్తి విశ్వాసాన్ని వెలిబుచ్చారు'' అని ఐఎస్పీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది రెండో క్షిపణి పరీక్ష
పాకిస్థాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గత శనివారం నుంచి ఇది రెండోసారి. 450 కిలోమీటర్ల రేంజ్ కలిగిన 'అబ్దాలీ వెపన్ సిస్టమ్' అనే బాలిస్టిక్ క్షిపణిని శనివారంనాడు పరీక్షించింది. భూతలం నుంచి భూతలంలోని లక్ష్యాలను ఈ మిస్సైల్ ఛేదిస్తుందని, క్షిపణి పరీక్ష విజయవంతమైనందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, పాక్ క్షిపణి పరీక్షలపై భారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఇది తీవ్రమైన కవ్వింపు చర్యగా పరిగణనిస్తున్న సైనిక వర్గాలు పేర్కొన్నారు.
మరోవైపు, భారతదేశంతో ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై పాకిస్థాన్ ప్రభుత్వం, మిలటరీ అన్ని రాజకీయలతో ఆదివారంనాడు వర్చువల్ సమావేశం నిర్వహించినటటు 'డాన్' పత్రిక పేర్కొంది. జైలులో ఉన్న మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సైతం ఈ వర్చువల్ మీట్లో పాల్గొన్నారు. భారతదేశం ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా దీటైన జవాబు ఇవ్వాలని అన్ని పార్టీలు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి..