Maldives: అధ్యక్షుడు ముయిజు వ్యాఖ్యలు సరికాదు.. ఇండియాకు క్షమాపణ చెప్పాలి.. మాజీ మంత్రి
ABN , Publish Date - May 04 , 2025 | 08:50 AM
Maldives India Diplomatic Row: గతేడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో న్యూ ఢిల్లీతో మాకెలాంటి ఆందోళనలు లేవని తాజాగా వ్యాఖ్యానించడం దుమారం లేపుతోంది. తమ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఖండిస్తూ మాల్దీవుల మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

India Maldives Relations: భారతదేశానికి మాల్దీవులకు మధ్య ఉన్న ఒప్పందాల విషయంలో తమకెలాంటి ఆందోళనా లేదని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. దీనిని మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలో ముయిజు రాజకీయ కపటత్వంతో ప్రజలను తప్పుదారి పట్టించారని షాహిద్ ఆరోపించారు. మాల్దీవులు, భారతదేశ ప్రజలు ఇద్దరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, జరిగిన అనర్థాలకు పూర్తి వివరణ ఇవ్వాలని షాహిద్ డిమాండ్ చేశారు.
భారతదేశంతో మాల్దీవులకు ఉండే ఒప్పందాలు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అధ్యక్షుడు ముయిజ్జు 2023 ఎన్నికల ప్రచారంలో ప్రజలను తప్పదోవ పట్టించి గెల్చారని షాహిద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇండియా ఉండే సమస్యలను తగ్గించి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత అధికారులతో తన తొలి సమావేశంలోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారని గుర్తుచేశారు.
'భారతదేశానికి క్షమాపణ చెప్పాలి'
X లో చేసిన ఒక పోస్ట్ లో, ముయిజు భారతదేశంతో మాల్దీవుల సంబంధాలకు సంబంధించి "తప్పుడు వాదనలు" వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడని.. కానీ ఇప్పుడు అదే వ్యాఖ్యలపై వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడని షాహిద్ అన్నారు. మాల్దీవులు, భారత్ ద్వైపాక్షిక ఒప్పందాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ధృవీకరించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. 2023 ఎన్నికల ప్రచారంలో మాత్రం ఈ ఒప్పందాల వల్లే దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తాయని ప్రచారం చేసి ఎన్నికల విజయం సాధించారని చెప్పుకొచ్చారు. భారతదేశంపై ముయిజు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల ప్రతిష్ఠను, విశ్వాసాన్ని దెబ్బతీశాయని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాల్దీవులు, భారత ప్రజలకు అధ్యక్షుడు ముయిజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు గతేడాది భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య చిచ్చు మొదలైంది. ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. అప్పట్లో బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెంట్ అయింది. ఇక పర్యాటకమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న మాల్దీవులకు అప్పటి నుంచి ఇండియా నుంచి వెళ్లే సందర్శకులు బాగా తగ్గిపోయారు. ఇంత జరిగినా వెనక్కి తగ్గలేదు అధ్యక్షుడు ముయిజ్జు. దశాబ్దాలుగా మాల్దీవుల పురోగతి సహకరిస్తూ పెద్దన్నలా అండగా నిలబడుతున్న ఇండియాను కాదని చైనాకు దగ్గరవుతున్నారు.
Read Also: Trump Harvard clash: పన్ను మినహాయింపు హోదా తొలగిస్తా
Trump Import Duties: పచ్చళ్లపైనా ట్రంప్ సుంకం
Russia: రష్యా విక్టరీ డే అతిథులకు ఉక్రెయిన్ హెచ్చరిక