Iran-Israel: ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అమెరికా షాకింగ్ నిర్ణయం..
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:41 AM
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు.

ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లోని టెహ్రాన్ పరిసర ప్రాంతాలపై దాడులకు తెగబడుతోంది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతోంది. దీంతో ఇజ్రాయెల్లో ముందు జాగ్రత్త చర్యగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో వైమానిక దాడులతో (Israeli airstrike on Iran) ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. శుక్రవారం టెహ్రాన్లోని ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ గార్డ్ అధిపతి హుస్సేన్ సలామీ మృతి చెందారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రతిదాడి అనుమానంతో ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధించారు.
మాకే సంబంధం లేదు..
ఈ నేపథ్యంలో అమెరికా (America) విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ఈ దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అలాగే తమ బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని తమ బలగాలను అమెరికా ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ముందుగానే హెచ్చరించారు. దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్కు సూచించారు. అయినా ట్రంప్ సూచనలను ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టి దాడులు చేసింది.
అప్రమత్తంగా ఉండండి..
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లోని భారత ఎంబసీ పోస్టు స్పందించింది. ఇరాన్లోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారత ఎంబసీ సోషల్ మీడియా ఖాతా అనుసరించాలని, భద్రతా ప్రోటోకాల్ పాటించాలని పేర్కొంది.
ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైంది..
ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైందని చెప్పారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా సైనిక చర్య చేపడుతున్నామన్నారు. ముప్పు తొలగించుకునేందుకు ఎన్ని రోజులైనా ఆపరేషన్ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ దాడుల్లో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ టెహ్రాన్ వేదికగా అణు సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసింది. శుక్రవారం వేకువజాము టెహ్రాన్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ దాడితో మున్ముందు మరిన్ని దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చదవండి:
శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి