Home » Israel
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధ భయాందోళనలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున మిడిల్ ఈస్ట్లో చోటుచేసుకున్న దాడులు (Israel Strikes Iran) ఈ ప్రశ్నను మళ్లీ వెలుగులోకి తెచ్చాయి. ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో మరో ఇద్దరు ప్రముఖ ఇరాన్ జనరల్స్ మృతి చెందారు.
Petrol Diesel Prices: బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 74.23 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే.. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 80 నుంచి 100 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
Israel Apologizes To India: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) తమ అఫిషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. దాడుల గురించి స్పందిస్తూ.. ‘ఇరాన్ ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇజ్రాయెల్ దాని అంతిమ లక్ష్యంకాదు.. అది ఆరంభం మాత్రమే. మాకు ఇది తప్ప వేరే దారి లేదు’ అని పేర్కొంది.
Iran And Israel War: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ మ్యాప్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా... శుక్రవారం ఆ దేశంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో (టెహ్రాన్ స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో)..
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ అద్భుతమైన దాడులు జరిగాయని, మరిన్ని బలమైన దాడులు పొంచి ఉన్నాయని ఇరాన్ను హెచ్చరించారు.
ఇజ్రాయెల్ మరోసారి భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. ఇరాన్పై కొనసాగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్లో దాదాపు 200 యుద్ధ విమానాలు మోహరించబడి, 100కి పైగా వ్యూహాత్మక లక్ష్యాలను కూల్చివేశాయి. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్లోని నాటాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రంతోపాటు పలు మిలటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.
Operation Rising Lion: ఇరాన్ న్యూక్లియర్ బాంబు ఆశలపై ఇజ్రాయెల్ నీళ్లు చల్లడానికి చూస్తోంది. ఇరాన్ దగ్గర ఒక్క అణు బాంబు కూడా లేదు. చాలా ఏళ్ల నుంచి అణు బాంబును తయారు చేయాలని శ్రమిస్తోంది.