Miguel Uribe: ప్రచార సభలో కాల్పులు.. ఏకంగా అధ్యక్ష అభ్యర్థి తలపై గురిపెట్టి..!
ABN , Publish Date - Jun 08 , 2025 | 10:37 AM
ఓ దేశంలో అధ్యక్ష అభ్యర్థి మీద హత్యాయత్నం జరిగింది. ఏకంగా ఆయన తల మీద గురిపెట్టి కాల్పులు జరిగాయి. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

కొలంబియా సెనేటర్, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే (39) మీద శనివారం నాడు కాల్పులు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. బొగోటా పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో మిగ్యుల్ టర్బే కొద్దిసేపు ప్రసంగించారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ దుండగుడు ఆయన్ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. మిగ్యుల్ తలను టార్గెట్గా చేసుకొని హత్యాయత్నం జరిగిందని సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని బొగోటా నగర మేయర్ కార్లోస్ గాలన్ ధృవీకరించారు.
ప్రజాస్వామ్యంపై దాడి..
మిగ్యుల్ ఉరిబ్ టర్బే మీద కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ తెలిపారు. సంచలనంగా మారిన ఈ ఘటన మీద మిగ్యుల్ పార్టీ కన్జర్వేటివ్ డెమొక్రటిక్ స్పందించింది. ఈ హత్యాయత్నాన్ని ఆ పార్టీ ఖండించింది. ఇది మిగ్యుల్ మీదో లేదా ఒక రాజకీయ నేతపై జరిగిన దాడిలా చూడొద్దని.. ఇది దేశ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మీద జరిగిన అటాక్ అని కన్జర్వేటివ్ డెమొక్రటిక్ పేర్కొంది. ఈ కాల్పుల ఘటనపై కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో రియాక్ట్ అయ్యారు. మిగ్యుల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు గుస్తావో పెట్రో తెలిపారు. కాగా, వచ్చే సంవత్సరం ఆరంభంలో కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కన్జర్వేటివ్ డెమొక్రటిక్ పార్టీ నుంచి మిగ్యుల్ టర్బే రేసులో ఉన్నారు.
ఇవీ చదవండి:
ఆస్పత్రి కింద సొరంగం.. వీడియో వైరల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి