CPEC: ఆప్ఘన్ వరకూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విస్తరణ.. భారత్ అభ్యంతరం
ABN , Publish Date - May 21 , 2025 | 04:23 PM
భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

బీజింగ్: చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ (CPEC)పై భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బీజింగ్లో బుధవారంనాడు ఈ మూడు దేశాల మధ్య జరిగిన అనధికార త్రైపాక్షిక సమావేశంలో సీపీఈసీను ఆప్ఘనిస్థాన్ వరకూ విస్తరించేందుకు అంగీకారం కుదిరిందని 'రాయిటర్స్' వార్తా సంస్థ తెలిపింది.
Terror Attack School Bus: స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి, 38 మందికి గాయాలు
పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆప్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖిలు ఈ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. తమతమ దేశాల్లో వాణిజ్యం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, దౌత్యపరమైన చర్యలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మూడు దేశాల మధ్య అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామనే సంకేతాలిస్తూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) విషయంలో లోతైన సహకారానికి సమావేశంలో నిర్ణయించారని, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ను ఆప్ఘన్ వరకూ విస్తరించేందుకు అంగీకారం తెలిపారని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
సమావేశానంతరం ఇషాక్ దార్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వివరాలు పంచుకుంటూ, ప్రాంతీయ శాంతి, సుస్థిరత, అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పాకిస్థాన్, చైనా, ఆప్ఘనిస్థాన్ నిర్ణయించినట్టు చెప్పారు. భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
సీపీఈసీపై భారత్ అభ్యంతరం
కాగా, చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)ని మూడో దేశానికి విస్తరించడంపై భారత్ తన అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టులో మూడో దేశం పాలుపంచుకుంటే అది జమ్మూకశ్మీర్లోని భారత భూభాగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని విదేశాంగ శాఖ గత ఏడాది స్పష్టం చేసింది. చట్ట విరుద్ధ చర్యలకు దిగుతున్నారని, ఇది అంగీకారయోగ్యం కాదని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్ట్ పీవోకే మీదుగా వెళ్తున్న క్రమంలో భారత్ ఈ అభ్యంతరాలు తెలుపుతోంది.
Israel Bombing: గాజాలో మృత్యుముఖాన 14వేల చిన్నారులు
COVID-19: ఆసియాలో కోరలు చాస్తున్న కొవిడ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి