చదువుకు వయసు అడ్డం కాదుగా.. ఏడు పదుల వయసులో..
ABN , Publish Date - May 17 , 2025 | 10:36 AM
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు ఓ వృద్థులు. ఏడు పదుల వయసులో.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇప్పటి విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. కోదండరామన్ అనే వృద్థులు పదవ తరగతి పాసయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- 70ఏళ్ల వయసులో పదిలో ఉత్తీర్ణత
చెన్నై: చదువుకోవాలనే తపన ఉంటే దానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు చిదంబరం సమీపంలో 70 ఏళ్ల వృద్ధుడు. కోవిలాంపూండి గ్రామానికి చెందిన కోదండరామన్ (70) అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1965లో 5వ తరగతి పూర్తిచేశాడు. అనంతరం చిదంబరం రామస్వామి చెట్టియార్ మహోన్నత పాఠశాలలో 6వ తరగతి చదివాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు మృతిచెందడంతో చదువు కొనసాగించలేకపోయాడు.
ఈ వార్తను కూడా చదవండి: India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తల్లిదండ్రుల మరణానంతరం తాతా, బామ్మ సంరక్షణలో ఉన్న కోదండరామన్ మేనమామ రాజగోపాల్ సహాయంతో రైల్వేలో కాంటాక్ట్ కార్మికుడిగా చేరాడు. అప్పుడు అతడి నెల వేతనం రూ.4.35 పైసలు. 1980లో రైల్వేలో ఉద్యోగం పర్మినెంట్ కావడంతో 30 సంవత్సరాలు పనిచేశాడు. పదవీ విరమణ పొందిన అనంతరం 2002లో 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 2024లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాశాడు. సైన్స్, సోషల్లో ఉత్తీర్ణులైన కోదండరామన్, మిగిలిన మూడు పాఠ్యాంశాల్లో ఫెయిలయ్యాడు.
అనంతరం తమిళం, మ్యాథ్స్లో ఉత్తీర్ణులు కాగా, ఆంగ్లంలో ఫెయిలయ్యాడు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు రాసిన కోదండరామన్ ఆంగ్లంలో కూడా ఉత్తీర్ణులయ్యాడు. ఈ సందర్భంగా కోదండరామన్ మాట్లాడుతూ... చదువుకు వయస్సుతో సంబంధం లేదన్నారు. నన్ను చూసి విద్యార్థులు పోటాపోటీగా పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపారని, ఈ విజయానికి తన కుమారుడు కారణమని కోదండరామన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Variety Recipes: నోరూరించే రాగి రుచులు
Gachibowli: రేవంత్ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద
సురేఖ తెగించి కమీషన్ మంత్రుల పేర్లు చెప్పాలి
భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు
Read Latest Telangana News and National News