Home » Andhrajyothi
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
వివాహ వేడుకలో ఎక్కువ సేపు నిలబడడం, నడవడం, డ్యాన్సు స్టెప్పులు వేయడం వల్ల అలసటకు గురైన అతిథులు, కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ‘ఫుట్ స్పా’ను అందిస్తున్నారు.
గ్రామదేవతలకు బోనాలు చేసి, యాటను బలివ్వడం... ఆ తర్వాత కుటుంబం, సన్నిహితులతో కలిసి వేడుక జరుపుకోవడం మామూలే. అక్కడ మాత్రం అమ్మవారి ఆలయంలో ప్రతీ మంగళవారం మాంసంతో భోజనం పెడతారు. అమ్మవారి ప్రసాదంగా భావించి భక్తులు క్యూ కడతారు.
పర్యాటకులకు విశాఖపట్నంలో మరో ఆకర్షణ తోడయ్యింది. ఇప్పటి దాకా విదేశాల్లో మాత్రమే చూసిన అద్దాల వంతెనపై నడక అనుభవాన్ని ఇక నుంచి మనమూ పొందొచ్చు. దేశంలోనే అతి పొడవైన ‘స్కై గ్లాస్ బ్రిడ్జ్’ని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) నిర్మించింది.
నదులు సముద్రాల్లో కలిసే దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? అలాగే నదీ సంగమం కూడా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వచ్చిన నదులు... ఒకచోట కలిసి పెద్ద నదిగా మారి ప్రవహిస్తుంటాయు. ఆ సమయంలో వాటి రంగుల్లో తేడాలుండటం వల్ల అక్కడొక అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అలాంటి కొన్ని వి‘చిత్ర’ నదీ సంగమాల విశేషాలే ఇవి...
మార్చెల్ల గియులియాపేస్.. ఇటలీ దేశస్థురాలు. ఒకప్పుడు మాఫియా రాజ్యానికి పెట్టింది పేరయిన ‘సిసిలీ’లోని రగుస ద్వీపంలో పుట్టిందామె. వాళ్ల అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో సిసిలీ తుపాకుల మోతతో హింసాత్మకంగా ఉండేది. మాఫియా ముఠాలు కొట్టుకుచచ్చేవి.
ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు మంచి జరుగుతుందని, ఆహ్వానం అందుకుంటారని తెలుపుతున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
కిడ్నీ రాకెట్ కేసులో.. గ్లోబల్ ఆసుపత్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రితోని ఆపరేషన్ థియేటర్, ఆపరేషన్కు ఉపయోగించిన పరికరాలు, మందులను స్వాధీనం చేసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.
మన జీవిత పుస్తకంలో ‘చార్ధామ్’ యాత్ర లాంటి పేజీ ఒకటి ఉంటే దానికి మరింత విలువ చేకూరుతుంది. ‘చార్ధామ్’ యాత్రలో వేసే ప్రతీ అడుగు జీవితంలో కొత్త మలుపునిస్తుంది. మానసికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆ విశేషాలే ఇవి...
పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి, ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు.