Hyderabad: కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి..
ABN , Publish Date - May 16 , 2025 | 10:24 AM
నగరంలో.. దారుణం చోటుచేసుకుంది. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి ఓ యువకుడిని హత్య చేశారు. పాతకక్షల నేపధ్యంలోనే.. ఈ హత్య జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- నాంపల్లిలో యువకుడి హత్య
హైదరాబాద్: నాంపల్లి ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టలో నివసించే అయాన్ ఖురేషీ ఓ పాత కేసు విచారణ నిమిత్తం గురువారం ఉదయం నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు ఆయనను వెంబడించారు.
ఈ వార్తను కుడా చదవండి: Hyderabad: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు చేరుకోగానే కత్తులు, కర్రలతో అయాన్పై దాడి చేశారు. గొంతు, పొట్టలో కత్తులతో పొడిచారు. దీంతో అయాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సగం కత్తి కడుపులోనే చిక్కుకుంది. హత్యకు ఉపయోగించిన కర్రలు, కత్తులు, ద్విచక్ర వాహనాన్ని నిందితులు అక్కడే వదిలి పరారయ్యారు.
పాతకక్షలే కారణమా..
అయాన్ ఖురేషి 2020లో కాంచన్బాగ్ పీఎస్ పరిధిలో జరిగిన బావ హత్య కేసులో నిందితుడు. అయాన్పై కక్ష పెంచుకున్న బంధువులే అతడిని మరో వ్యక్తితో కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, సైఫాబాద్ ఏసీపీ సంజయ్కుమార్, నాం పల్లి సీఐ నారాయణరెడ్డి, ఎస్ఐ సాయికుమార్ తదితరులు ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్టీం, ఫింగర్ప్రింట్ బృందాలు ఆధారాలను సేకరించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇషా ఖురేషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..
తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు
Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు
పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ఆర్టీసీ సీసీఎస్లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి
Read Latest Telangana News and National News