Share News

Hyderabad: వీళ్లు మామూలు వ్యక్తులు కాదుగా.. రూ.99.20 లక్షలు కాజేశారు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 10 , 2025 | 07:49 AM

విదేశాల్లో చదువు, ఉద్యోగం కోసం వీసాలు ఇప్పిస్తానని నమ్మించి యువకులను నట్టేట ముంచుతున్న ఇద్దరు మోసగాళ్లను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: వీళ్లు మామూలు వ్యక్తులు కాదుగా.. రూ.99.20 లక్షలు కాజేశారు.. ఏం జరిగిందంటే..

- విదేశీ వీసాల పేరుతో మోసం

- ఇద్దరు మోసగాళ్ల అరెస్ట్‌

హైదరాబాద్: విదేశాల్లో చదువు, ఉద్యోగం కోసం వీసాలు ఇప్పిస్తానని నమ్మించి యువకులను నట్టేట ముంచుతున్న ఇద్దరు మోసగాళ్లను పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) అరెస్ట్‌ చేశారు. తమిళనాడు(Tamilnadu)కు చెందిన డానియేల్‌ గ్లోబల్‌ పాత్‌వే ఎడ్యుకేషన్‌ అండ్‌ వీసా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ పేరుతో పంజాగుట్టలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. వీసా ఇప్పిస్తానని పలువురు యువకుల నుంచి రూ.99.20 లక్షలు వసూలు చేశాడు.


city3.jpg

ఆదిలాబాద్‌కు చెందిన జహీర్‌ఖాన్‌(Zaheer Khan) యువకులను మభ్య పెట్టి, డానియేల్‌ మోసాలకు సహకరించేవాడు. మలక్‌పేట(Malakpet)కు చెందిన మీర్‌ మజార్‌ అలీ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు డానియేల్‌తోపాటు జహీర్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13 మొబైల్‌ ఫోన్లు, 2 ల్యాప్‌టా్‌పలు, యాపిల్‌ ఐపాడ్‌, వోక్స్‌వాగన్‌ కారును స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు

నిన్ను ఏమడిగారు.. నేనేం చెప్పాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 10 , 2025 | 07:50 AM