Hyderabad: రూ. 2.99 కోట్లు చూపించి.. రూ. 61.52 లక్షలు కొట్టేశారు.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Jun 11 , 2025 | 08:47 AM
ట్రేడింగ్లో వర్చువల్గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

- అధిక లాభాల పేరుతో మోసం
హైదరాబాద్ సిటీ: ట్రేడింగ్లో వర్చువల్గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత(Cyber Crime DCP Dhara Kavitha) తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి ఫేస్బుక్ ఫాలో చేయగా, జీ-6 నువామా వెల్త్ గ్రూపు నుంచి వచ్చినట్లు గుర్తించాడు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ సారాంశం. వెంటనే అక్కడున్న మొబైల్ నంబర్లలో బాధితుడు సంప్రదించాడు.
నువామా వెల్త్ గ్రూపు నుంచి స్పందించిన వ్యక్తులు ఒక లింకు పంపించారు. అందులో వివరాలు నమోదు చేసిన వెంటనే కొంతమంది వ్యక్తులు లైన్లోకి వచ్చారు. వ్యాపారం, పెట్టుబడుల గురించి వివరించారు. అనంతరం బాధితుడు ఐపీఓ షేర్లను కొనుగోలు చేశాడు. ప్రారంభంలో మంచి లాభాలు రావడంతో వాటిని విత్డ్రా చేసుకుంటూనే రూ. 61.52 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఏకంగా రూ.2.99 కోట్లు ఖాతాలో ఉన్నట్లు వర్చువల్గా కనిపించింది. ఆ డబ్బులోంచి బాధితుడు రూ.56 లక్షలు విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాలేదు.
ఇదేంటని ప్రశ్నించగా, మొత్తం డబ్బుపై రూ.20 శాతం కమీషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే విత్డ్రా చేయడం కుదరదని, పెట్టుబడులు కొనసాగించాలని అన్నారు. ఉన్న డబ్బులోంచి కమీషన్ తీసుకుని, మిగతాది ఇవ్వాలని చెప్పినా వినలేదు. ఇదంతా సైబర్ మోసం అని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News