Hyderabad: నాపేరు టోనీ విలియం.. లండన్ నుంచి మాట్లాడుతున్నా..
ABN , Publish Date - Jun 14 , 2025 | 08:05 AM
మహిళా టీచర్తో సోషల్మీడియాలో స్నేహం నటించిన సైబర్ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్కు గతేడాది డిసెంబర్లో ఫేస్బుక్ మెసేంజర్ నుంచి కాల్ వచ్చింది.

- వజ్రపు ఉంగరం బహుమతి పేరుతో.. టీచర్కు టోకరా
- రూ.2.02 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు
- సోషల్మీడియాలో స్నేహం పేరుతో మోసం
హైదరాబాద్ సిటీ: మహిళా టీచర్తో సోషల్మీడియాలో స్నేహం నటించిన సైబర్ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్కు గతేడాది డిసెంబర్లో ఫేస్బుక్ మెసేంజర్ నుంచి కాల్ వచ్చింది. ‘నాపేరు టోనీ విలియం. లండన్ నుంచి మాట్లాడుతున్నా’ అని పరిచయం చేసుకున్నాడు. ‘నాకు భారతీయులు అంటే చాలా ఇష్టం. ఎంతో మంది ప్రొఫైల్స్ చెక్ చేశాను. నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న ప్రొఫైల్ కనిపించలేదు. మొదటిసారి మీ ప్రొఫైల్ నచ్చింది. అందుకే మీకు కాల్ చేశాను’ అన్నాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది.
లండన్లో ఆస్తి రాసిస్తానని..
తాను లండన్లో పెద్ద కోటీశ్వరుడినని, రెండు పెద్ద పెద్ద ఇళ్లు, అపారమైన ఆస్తులు ఉన్నాయని నమ్మబలికాడు. కానీ నాకు వారసులు లేరని, తనకిష్టమైన భారతీయులకు ఆస్తిలో సగం రాసి ఇవ్వాలని నిర్ణయించుకున్నాని తెలిపాడు. ఇన్ని రోజులకు ప్రొఫైల్ నచ్చి మీతో స్నేహం చేస్తున్నానని చెప్పాడు. ఆమె పూర్తిగా నమ్మిన తర్వాత ‘ముందుగా నా స్నేహితురాలి కోసం ఒక ఖరీదైన వజ్రపు ఉంగరం, బంగారు గొలుసు పార్శిల్ పంపుతున్నా’ అని టీచర్కు చెప్పాడు. పార్శిల్ పంపేముందు ఫొటోలు, వీడియోలు తీసి పోస్టు చేశాడు. కొద్దిరోజుల్లో తనకు ఖరీదైన పార్శిల్ వస్తోందని ఆ టీచర్ మురిసిపోయింది.
అనంతరం ఆమెకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ ఒక ఫోన్ వచ్చింది. ‘మీ పేరుతో పార్శిల్ వచ్చింది. అందులో ఖరీదైన డైమండ్, బంగారం ఉన్నాయి. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి. అప్పుడే పార్శిల్ డెలివరీ అవుతుంది’ అని చెప్పారు. అందుకోసం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో బాధితురాలు వారు చెప్పిన విధంగా రూ.2.02లక్షలు చెల్లించింది. అయినా పార్శిల్ రాకపోవడం, లండన్ స్నేహితుడు సహా ఎవరూ స్పందించకపోవడంతో ఇదంతా మోసమని బాధితురాలు గుర్తించింది. పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News