Hyderabad: తమ్ముడి ఫొటోను డీపీగా పెట్టి అన్నకు టోకరా
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:12 AM
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. అలాగే లక్షలు రూపాయలు నష్టపోతున్నారు. ఈ సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబరఓ మోసానికి బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతికి చిక్కి రూ.1.19లక్షలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..

- రూ.1.19లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: సౌదీలో ఉంటున్న తమ్ముడి ఫొటోను డీపీగా పెట్టి, హైదరాబాద్(Hyderabad)లో ఉంటున్న అతని అన్న నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.19లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సౌదీ వెళ్లాడు. అతని అన్న హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అన్నకు తమ్ముడి పేరుతో ఫేస్బుక్ మెసేజ్ వచ్చింది. అన్న భార్య(వదిన) మెజేస్ చూసి రిప్లై ఇవ్వగా, అవతలి వ్యక్తి వాట్సాప్ నంబర్ అంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు.
వాట్సాప్ ఖాతాలో మరిది ఫొటోనే ఉండటంతో ఆమె నమ్మింది. అన్నయ్యకు డబ్బులు పంపాలంటూ అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాడు. కొద్దిసేపటి తర్వాత వెస్ట్రన్ యూనియన్ ద్వారా డబ్బు బదిలీ చేసినట్లు రశీదును పంపాడు. 24 గంటల్లో ఆ డబ్బు అన్నయ్య ఖాతాలో జమ అవుతుందని చెప్పాడు. అయితే, ఒక గంట తర్వాత మరోసారి అదే నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
తన మరిది ఫోన్ చేశాడని భావించిన ఆమె ఫోన్ ఎత్తింది. వేరే వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. సౌదీలోని భారత ఎంబసీ నుంచి మాట్లాడుతున్నానని, వీసా గడువు ముగిసిన కారణంగా మీ మరిది ఎంబసీలో చిక్కుకున్నాడని, దాన్ని పునరుద్ధరించడానికి వెంటనే డబ్బు పంపాలని చెప్పాడు. డబ్బు పంపాల్సిన ఖాతా వివరాలిచ్చాడు.
ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. నేరగాడు చెప్పిన ఖాతాలో రూ.1.19 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత తమ్ముడి కోసం అన్న అదే నంబర్కు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. తమ వద్ద ఉన్న మరో నంబర్కు ఫోన్ చేస్తే తన తమ్ముడు సౌదీలో ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం
Read Latest Telangana News and National News