Share News

Hyderabad: పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా.. తిరుపతి టు హైదరాబాద్‌కు సరఫరా

ABN , Publish Date - Jun 03 , 2025 | 08:14 AM

ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విషయం బయటపడింది. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 800 గ్రాముల హెరాయిన్‌, ఏపీడ్రిన్‌ డ్రగ్స్‌ను, రూ.50వేలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్రగ్స్‌ దందా.. తిరుపతి టు హైదరాబాద్‌కు సరఫరా

- ఆటకట్టించిన కూకట్‌పల్లి పోలీసులు

- 800 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: తిరుపతి నుంచి హైదరాబాద్‌(Tirupati to Hyderabad)కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ ఏపీ కానిస్టేబుల్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ తిరుపతికి చెందిన ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌.. గుట్టుగా డ్రగ్స్‌ను కూకట్‌పల్లి వివేకానందనగర్‌(Kukatpally Vivekanandanagar)కు సరఫరా చేసి, విక్రయించేందుకు ప్రయత్నించాడు.


city3.jpg

సమాచారం అందుకున్న ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు(Kukatpally Police) నిఘా పెట్టి కానిస్టేబుల్‌తో పాటు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి 800 గ్రాముల హెరాయిన్‌, ఏపీడ్రిన్‌ డ్రగ్స్‌ను, రూ.50వేలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి.

నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2025 | 08:14 AM