Penny Stock: ఈ స్టాక్పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
ABN , Publish Date - May 12 , 2025 | 04:34 PM
స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దీనిపై పరిశోధన చేసి అనేక మంది కూడా తక్కువ మొత్తంతో, తక్కువ టైంలోనే భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. అందుకు ఈ వార్తనే ఉదాహరణ అని చెప్పవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం పదండి.

స్టాక్ మార్కెట్. ఇది అనేక మందికి కూడా అర్థం కాదని, దీని నుంచి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని పలువురు చెబుతుంటారు. కానీ స్టాక్ మార్కెట్ గురించి సరిగ్గా తెలుసుకుని, దీర్ఘ కాలంలో మంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం భారీ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల షేర్స్ కొనుగోలు చేసి కనీసం ఐదేళ్లు లేదా పదేళ్ల వరకు చూస్తే మాత్రం, మీరు చేసిన పెట్టుబడి కంటే రెట్టింపు మొత్తాలను పొందవచ్చని అంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. కానీ ఇది ఓ చిన్న కంపెనీ స్టాక్ విషయంలో జరగడం విశేషం. ఎందుకంటే చిన్న కంపెనీల స్టాక్ ఎంపిక చేసుకుని పెట్టుబడులు చేయడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.
650% కంటే ఎక్కువ
అలాంటి కంపెనీలను ఎంచుకుని భారీ లాభాలను అందించిన వాటిలో ఇప్పుడు రతి స్టీల్ కూడా చేరింది. ఎందుకంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు ఇది గత ఐదు సంవత్సరాలలో దాదాపు 650% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో ఈ స్టాక్ అనేక మంది చిన్న పెట్టుబడిదారుల కలలను నిజం చేసింది. ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ పనితీరులో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ నేపథ్యంలో స్మాల్ క్యాప్ స్టాక్ రతి స్టీల్ షేర్లు సోమవారం 7% కంటే ఎక్కువ పెరిగి రూ.30కి చేరుకున్నాయి.
4 లక్షల రూపాయలు
ఈ కంపెనీ స్టాక్ ఏడేళ్ల క్రితం అంటే 2018లో రూ.2గా ఉంది. ఆ సమయంలో ఈ కంపెనీ స్టాక్స్ రెండు లక్షలు కొనుగోలు చేసి, ఇప్పటి వరకు ఉంచిన వారికి మంచి లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. అంటే అప్పుడు 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు మాత్రం రూ.56 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. అంటే కేవలం ఏడేళ్లలోనే 15 రెట్ల లాభం వచ్చింది. కనీసం ఐదేళ్లపాటు ఈ కంపెనీలో పెట్టుబడులు ఉంచిన వారికి సైతం మంచి రాబడులు వచ్చాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో చిన్న కంపెనీల స్టాక్స్ మరోసారి సత్తా ఏంటో నిరూపించాయి.
వాటా ఏకంగా 9%
ఈ కంపెనీ ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) Fe 500 రీన్ఫోర్స్మెంట్ బార్లపై BIS స్టాండర్డ్ మార్కును ఉపయోగించడానికి రతి స్టీల్ను ఆమోదించారు. ఈ లైసెన్స్ మే 9, 2025న జారీ చేయబడిందని (CM/L–8700195219), మే 8, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ సమాచారాన్ని పంచుకున్న తర్వాత, రతి స్టీల్ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. ఈ క్రమంలో కంపెనీ వాటా ఏకంగా 9% పెరిగింది. అయితే, ఈ పెరుగుదల ఉన్నప్పటికీ, స్టాక్ ఇప్పటికీ దాని 52 వారాల గరిష్ట స్థాయి రూ. 97.81 కంటే 69% దిగువన ఉండటం విశేషం. మార్చి 2025లో ఇది 52 వారాల కనిష్ట స్థాయి రూ. 24.50కి పడిపోయింది.
గమనిక: ఆంధ్రజ్యోతి పెట్టుబడి సలహాలను ఇవ్వదు. స్టాక్ మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి నిపుణుల సలహా తీసుకోండి.
ఇవి కూడా చదవండి
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
US-China: ట్రేడ్ వార్కు 90 రోజులు బ్రేక్.. అమెరికా-చైనా చర్చలు ఫలప్రదం
Stock Market: భారత్-పాక్ కాల్పుల విరమణ.. స్టాక్ మార్కెట్లకు ఫుల్ జోష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి