RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. లోన్లు తీసుకున్న వాళ్లకు ఇక పండగే..
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:30 AM
ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.

ఆర్బీఐ (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో గృహ రుణాల వడ్డీరేట్లు 7.5 శాతం తగ్గనున్నాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా ఉంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెపోరేటు మరో 75 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రెపో రేటు 5.0% నుంచి 5.25% కు చేరుకోవచ్చు. దీనివల్ల బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుంటుంది.
వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో వరుసగా ఇది మూడోసారి అని చెప్పాలి. ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించారు. తాజాగా మళ్లీ వడ్డీ రేట్లు (Interest Rates) తగ్గించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణాలు తీసుకున్న వారందరికీ ఇది శుభవార్త అనే చెప్పాలి. దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇస్మార్ట్ ఆటో డ్రైవర్.. ఇతడు నెలకు రూ.8 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..