Savings Schemes: 5 ఏళ్లలో రూ.4 లక్షల రాబడి.. పోస్టాఫీసులోని ఈ పథకాల గురించి తెలుసా..
ABN , Publish Date - Jun 07 , 2025 | 10:45 AM
డబ్బులు పొదుపు చేసేందుకు ప్రస్తుతం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల ఎక్కువ మంది పోస్టాఫీసు అందించే పథకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిస్క్ లేని రెండు బెస్ట్ పోస్టాఫీసు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారి కోసం అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పథకంలో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో అనేక ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎంతో మంది తమ డబ్బులను పోస్టాఫీస్ పథకాల్లో పొదుపు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీసులోని రెండు పథకాల గురించి తెలుసుకుందాం.
పోస్టాఫీసు (Post Office Schemes) అందించే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకాలు పొదుపు చేసేందుకు మంచి మార్గాలని చెప్పొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా ఐదేళ్లలో రాబడి కోరుకునే వారికి ఈ పథకాలు బెస్ట్ ఛాయిస్.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
ఈ స్కీమ్ 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే VRS తీసుకునే పౌర రంగ ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ నుంచి రిటైర్మెంట్ పొందిన వారు షరతులతో వయోపరిమితిలో సడలింపు పొందవచ్చు. అయితే ఈ పథకంలో రూ.10 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత రూ.14,10,000లు తీసుకోవచ్చు. ఇందులో కనీసం రూ.1000, గరిష్టంగా రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా ఈ పథకంలో రూ. 30 లక్షలు డిపాజిట్ చేస్తే.. 8.2శాతం చొప్పున వడ్డీగా రూ. 12,30,000 సంపాదించవచ్చు. ప్రతి త్రైమాసికంలో రూ. 61,500 వడ్డీని పొందొచ్చు. ఉద్యోగ విరమణ చేసి పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన పథకం కోసం వెతుకుతుంటే.. ఈ స్కీమ్ ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు .
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో కనీస డిపాజిట్ రూ.1000 ఉండగా, గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో కూడా పన్ను ప్రయోజనం ఉంది. ఈ స్కీమ్లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల రూ.14,49,034 మొత్తం లభిస్తుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతాయి. ఈ స్కీమ్లో కనీస పెట్టుబడి రూ.100 ఉండగా.. మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంది. అయితే 2024 అక్టోబర్ నుంచి ఈ స్కీమ్ కింద చేసే డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ వర్తించబోదని ప్రకటించారు.
Also Read:
వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్బీ, బీఓఐ
For More Business News and Telugu News..