Airtel: సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా సరికొత్త టెక్నాలజీనీ తీసుకొచ్చిన ఎయిర్టెల్..
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:57 PM
తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

తెలంగాణలోని ఎయిర్టెల్ కస్టమర్లు సైబర్ మోసాలకు గురి కాకుండా సదరు సంస్థ అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 180,000 హానికరమైన లింక్లను విజయవంతంగా బ్లాక్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5.4 మిలియన్కు పైగా వినియోగదారులను రక్షించింది. కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
తెలంగాణలో ఆన్ లైన్ మోసాలపై ఎయిర్టెల్ (Airtel) ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో సుమారు 180,000 హానికరమైన లింక్లను బ్లాక్ చేసింది. తద్వారా రియల్ టైమ్లో 5.4 మిలియన్ యూజర్లను కాపాడనుంది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుండి తెలంగాణలోని కస్టమర్లను రక్షించాలనే లక్ష్యంలో గణనీయమైన పురోగతిలో భాగంగా, భారతీ ఎయిర్టెల్ యొక్క తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సీఈవో అజయ్ అనంతపద్మనాభన్.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐపీఎస్ డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయెల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు AI ఆధారిత టూల్ గురించి వివరించారు.
ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఈఓ అజయ్ అనంతపద్మనాభన్ మాట్లాడుతూ.. తమ కస్టమర్లను అన్ని రకాల మోసాల నుండి రక్షించడం తమ బాధ్యత అని చెప్పారు. ఈ అత్యాధునిక ఫీచర్ను కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. వినియోగదారుల అత్యవసర అవసరాలను తీర్చడంతో పాటూ సృజనాత్మక పరిష్కారాలను అందించేందుకు AI-ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అవసరమన్నారు. ఈ కొత్త ఇంటెలిజెన్స్ తెలంగాణలోని వినియోగదారులను సైబర్ మోసాల నుండి రక్షిస్తుందని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఐపీఎస్, డీజీ శిఖా గోయెల్ మాట్లాడుతూ తెలంగాణలో సైబర్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎయిర్టెల్ చర్యలు తీసుకోవడం అభినందనీయమని ప్రశంచించారు.
ఎయిర్టెల్ వినియోగదారులకు హెచ్చరికలు అందించే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్.. తెలుగుతో సహా అనేక బాషల్లో సందేశాలను పంపిస్తుంది. తద్వారా అన్ని బాషల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఈ రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బ్యాక్ గ్రౌండ్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. దీనికి ఇన్స్టలేషన్ అవసరం లేదని సిబ్బంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో ఎయిర్టెల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ AI ఆధారిత టూల్ లాంచ్ అయిన 25 రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న 59 మిలియన్ కస్టమర్లను కాపాడినట్లు పేర్కొన్నారు.