Share News

రాజారెడ్డి అంటే ధైర్యం, సాహసం, పట్టుదల: షర్మిల

ABN , Publish Date - May 30 , 2025 | 04:58 AM

వైఎస్సార్‌ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా అరుదైన ధైర్యం, సాహసం, పట్టుదలను గుర్తు చేస్తూ ఆయన సమాధి వద్ద తల్లి విజయలక్ష్మితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం పులివెందులలోని చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రాజారెడ్డి అంటే ధైర్యం, సాహసం, పట్టుదల: షర్మిల

  • ఆయన శతజయంతి సందర్భంగా తల్లితో కలిసి నివాళులు

పులివెందుల రూరల్‌, మే 29(ఆంధ్రజ్యోతి): ‘రాజారెడ్డి అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ రాజారెడ్డి శతజయంతి సందర్భంగా గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పులివెందులలో వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సతీమణి విజయలక్ష్మి... రాజారెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రార్థనలు చేశారు. అనంతరం పులివెందులలోని సీఎస్ఐ చర్చి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కుటుంబం పట్ల రాజారెడ్డి చూపిన బాధ్యతను, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated Date - May 30 , 2025 | 04:59 AM