TDP Srinivasa Reddy : వైసీపీ వ్యవసాయాన్ని ముంచింది
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:55 AM
వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నట్టేట ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు...

అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నట్టేట ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులను ఖాతాల్లో జమ చేసింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైసీపీ బకాయిలు చెల్లించింది’ అని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.