Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:33 PM
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

ఇంటర్నెట్ డెస్క్: తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు.. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారని లోకేష్ అన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
అటు, పదోతరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్-2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన 95మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన 26మంది విద్యార్థులకి మంత్రి నారా లోకేష్ అవార్డులు అందజేశారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రైవేటు రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని లోకేష్ చెప్పారు.
అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాం.. సంస్కరణల ద్వారా రాబోయే నాలుగేళ్లలో ఏపీ విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News