Share News

Polavaram Banakacharla ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు..

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:13 PM

AP Government: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సాయంత్రం 3 గంటలకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్‌కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Polavaram Banakacharla ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు..
Polavaram Banakacharla Project

న్యూఢిల్లీ: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు (Polavaram Banakacharla project)పై కేంద్రం ముందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ప్రతిపాదనలు (Proposal) సిద్ధం చేసింది. పోలవరం (Polavaram) నుంచి బనకచర్ల (Banakacharla)కు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్ల (Rs 81,000 crore)తో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై రాష్ట్ర ఆర్ధిక, నీటిపారుదల శాఖల అధికారులు ప్రజెంటేషన్ (Presentation) ద్వారా వివరించనున్నారు. గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ (PM Modi), ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman)కు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) వివరించారు.


కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనపై పూర్తి వివరాలు ఇవ్వాలని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్‌కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరాలను అధికారులు కేంద్ర ఆర్థిక శాఖకు వివరించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపై వివరాలు అందించనున్నారు.

Also Read: తిరుమల నినాదాల ఘటనలో కీలక పరిణామం..


భవిష్యత్తులో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు స్వీయ ఆర్థిక ప్రాజెక్టుగా ఉంటుందని అధికారులు వివరించనున్నారు. తెలంగాణ లెవనెత్తుతున్న అభ్యంతరాలపై కూడా ప్రజెంటేషన్‌లో సమాధానం ఇచ్చే అవకాశముంది. సముద్రంలోకి వృధాగా పోతున్న సుమారు 2 వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ ఉన్న తెలంగాణకు కూడా ఉపయోగమే ఉంటుంది తప్ప.. ఆ రాష్ట్ర నీటిని తామేమీ తీసుకోవడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి విజయోత్సవ సభకు డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

For More AP News and Telugu News

Updated Date - Jun 02 , 2025 | 01:13 PM