Shining Stars Awards: ఏపీలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్ ప్రదానం
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:08 PM
Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.

విజయనగరం, జూన్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4,168 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డుల (Shining Stars Awards) పేరుతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఉత్తమ అత్యుత్తమ కనబరిచిన విద్యార్థులకు ఈరోజు (సోమవారం) ఈ అవార్డులతో సత్కరించారు. విజయనగరం జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం కార్యక్రమంలో హోంమంత్రి అనిత (Home Minister Vangalapudi Anitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు అవార్డులను ప్రదానం చేశారు.
అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషమన్నారు. విద్య.. విలువలు నేర్పుతుందన్నారు. విద్య విలువలు నేర్పుతుంది అనే పదానికి నిదర్శనం అశోక్ గజపతిరాజు అని అన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు. ప్రతీ విద్యార్థి లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళాలని తెలిపారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పిల్లలకు నడవడిక చాలా ముఖ్యమని.. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి అని సూచించారు.
విజయవాడలో షైనింగ్ సార్ట్ అవార్డ్స్
అటు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా స్థాయి ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రదానం చేశారు. షైనింగ్ స్టార్స్ అవార్డ్స్కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎమ్మెల్యే బోండా ఉమా, కలెక్టర్ లక్ష్మీశ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టెన్త్ , ఇంటర్లో ఉత్తీర్ణ మార్పులు సంపాదించిన విద్యార్థులకు అవార్డ్స్ అందజేశారు. టెన్త్లో ఉత్తీర్ణత మార్కులు వచ్చిన 131 మందికి, ఇంటర్లో ఉత్తీర్ణత పొందిన 43 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ను ప్రదానం చేశారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు రూ.20,000 వేలు పారితోషకం, మెడల్, ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేశారు.
విశాఖలో 121 మందికి అవార్డుల ప్రదానం
విశాఖలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 121 మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. విద్యార్థులు విజయాన్ని కాదు ఫెయిల్యూర్స్ కూడా తెలుసుకోవాలని.. అప్పుడు మనల్ని మనం సరి చేసుకోగలమన్నారు. ఏ విద్యార్థి తనని తాను తక్కువుగా చూసుకోకూడదని.. అది వారి ఎదుగుదలకు సమస్యగా మారకూడదని ఎంపీ అన్నారు.
నేటి విద్యార్థులే దేశానికే రాష్ట్రానికి అవసరమైన మానవ వనరులు అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్లే కాకుండా మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పడిపోయిందని, మరల ఉన్నత స్థాయికి వస్తుందని షైనింగ్ స్టార్స్ను ఇక్కడ చూస్తుంటే అర్థమవుతోందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విప్ గణబాబు, గండి బాబ్జీ , జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
ఆగ్రహావేశాలు.. సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Read Latest AP News And Telugu News