Share News

Lokesh Yoga Day: కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్

ABN , Publish Date - Jun 10 , 2025 | 02:52 PM

Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్‌మెంట్‌తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని.. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Lokesh Yoga Day: కలిసికట్టుగా యోగా డేను విజయవంతం చేద్దాం: మంత్రి లోకేష్
Lokesh Yoga Day

విశాఖపట్నం, జూన్ 10: విశాఖ వేదికగా జూన్ 21న జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు (International Yoga Day) సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యోగా దినోత్సవ వేడుకలపై ఈరోజు (మంగళవారం) మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లోని సాగరిక హాలులో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యోగా డేకు సంబంధించి మంత్రి లోకేష్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచం మనవైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పక్కా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. సూరత్‌లో జరిగిన ఈవెంట్‌ను స్టడీ చేసి.. పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు.


ఇదొక చారిత్రక కార్యక్రమమని.. కమిట్‌మెంట్‌తో ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలన్నారు. ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన క్రతువు ఇది అని చెప్పుకొచ్చారు. ప్రజలు 600 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవకూడదని.. ఆ మేరకు వాహన సదుపాయం కల్పించాలని అన్నారు. జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలని.. ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు చేశారు.


ఇక.. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2025 మాసోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీరోజు ప్రజలు యోగాసానాలు చేస్తున్నారు. యోగాంధ్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ యోగాసనాలు వేస్తున్నారు. యోగాను ప్రోత్సహించేందుకు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్‌ను యోగా రోడ్‌గా మార్చేశారు. అక్కడ ప్రతీ రోజు యోగా నిర్వహించేందుకు వీలు కల్పించింది సర్కార్. ఇక రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు, యువత, చిన్నారులు, వృద్ధులు అందరూ కూడా యోగాంధ్రలో భాగంగా యోగాసాలు వేస్తున్నారు. జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొననున్నారు.


ఇవి కూడా చదవండి

కొమ్మినేని శ్రీనివాస్‌కు రిమాండ్

ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 03:34 PM