Share News

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

ABN , Publish Date - May 05 , 2025 | 04:37 AM

కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో పది మంది వైసీపీ నాయకులు అరెస్టయ్యారు; బెయిల్‌ మంజూరైంది. ఏ-1 నిందితుడిగా ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి

YSRCP Leaders Arrests: కుంటిమద్ది హెలిప్యాడ్‌ ఘటనలో 10 మంది వైసీపీ నేతల అరెస్టు

  • బెయిల్‌ మంజూరుచేసిన కోర్టు

  • మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కోసం పోలీసుల గాలింపు

చెన్నేకొత్తపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్దిలో హెలిప్యాడ్‌ వద్ద జరిగిన ఘటనలో పది మంది వైసీపీ నాయకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన ఏడుగురు, రామగిరి మండలవాసులు ముగ్గురు ఉన్నారు. వీరిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం సాయంత్రం న్యాయాధికారి వెంకటేశ్వర్లు ఎదుట హాజరుపరిచారు. ఒక్కొక్కరికీ రూ.10వేల సొంత పూచీకత్తులో ఆయన బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని రామగిరి సీఐ శ్రీధర్‌ తెలిపారు. కాగా.. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.


హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు నగరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిసింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తోపుదుర్తి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది. హెలికాప్టర్‌ పైలట్‌ అనిల్‌కుమార్‌ రెండుసార్లు పోలీసుల విచారణకు గైర్హాజరు కావడం విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులో పోలీసుల అలసత్వంపై డీజీపీ కార్యాలయం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. బాధ్యులైన అధికారులెవరో విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ రత్నను ఆదేశించినట్లు తెలిసింది. కాగా.. 10 మంది వైసీపీ నేతలను అరెస్టుచేయడంతో ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఉదయాన్నే రామగిరి సర్కిల్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలోనే తిష్ఠవేశారు. కార్యకర్తలు గుమికూడుతుండడంతో పోలీసులు.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మాధవ్‌కు సూచించారు. దీంతో ఆయన వెళ్లిపోయారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ అరగంటపాటు స్టేషన్‌లోనే ఉన్నారు.హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు నగరాల్లో ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిసింది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తోపుదుర్తి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరుగుతోంది.


హెలికాప్టర్‌ పైలట్‌ అనిల్‌కుమార్‌ రెండుసార్లు పోలీసుల విచారణకు గైర్హాజరు కావడం విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తులో పోలీసుల అలసత్వంపై డీజీపీ కార్యాలయం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. బాధ్యులైన అధికారులెవరో విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ రత్నను ఆదేశించినట్లు తెలిసింది. కాగా.. 10 మంది వైసీపీ నేతలను అరెస్టుచేయడంతో ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఉదయాన్నే రామగిరి సర్కిల్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలోనే తిష్ఠవేశారు. కార్యకర్తలు గుమికూడుతుండడంతో పోలీసులు.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మాధవ్‌కు సూచించారు. దీంతో ఆయన వెళ్లిపోయారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ అరగంటపాటు స్టేషన్‌లోనే ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 05:19 AM