Srikakulam: సిక్కోలు విద్యార్థికి 18వ ర్యాంకు
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:16 AM
శ్రీకాకుళం జిల్లా దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 లో జాతీయస్థాయిలో 18వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 1వ స్థానాన్ని పొందారు. ఆయన 310 మార్కులతో ఐఏఎస్ కేబులుగా లక్ష్యం పెట్టుకున్నారు.

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి.. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. 360 మార్కులకుగాను 310 మార్కులు సాధించి జాతీయస్థాయి ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. రుత్విక్సాయి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. కాగా, ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని జ్ఞాన రుత్విక్సాయి తెలిపారు.
మరి కొందరికి కూడా..: జేఈఈ అడ్వాన్స్డ్ పలితాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన విక్రమరాజా ఓపెన్ కేటగిరీలో 216వ ర్యాంకు, ఓబీసీలో 30వ ర్యాంకు పొందారు. పొందూరు మండలానికి చెందిన పైడి వెంకట శ్రీవినయ్.. జాతీయస్థాయిలో 334వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 50వ ర్యాంకు సాధించారు.