IPS Sajjannar: ఆర్టీసీకి శ్రీవారి దర్శన కోటాను పునరుద్ధరించాలి సజ్జనార్
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:41 AM
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.

తిరుమల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లు చెప్పారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రార్థించా: సిరిసిల్ల రాజయ్య
అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామిని ప్రార్థించానన్నారు. ప్రతివ్యక్తికీ విద్యాబుద్ధులు కల్పించాలని కోరుకున్నట్లు చెప్పారు.