Women Panel Chief: మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్గా పురందేశ్వరి
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:43 AM
మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్గా ఎంపీ పురందేశ్వరి నియమితులయ్యారు. డీకే అరుణ, కడియం కావ్య ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.

సభ్యులుగా ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్య
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ కమిటీ వివరాలను లోక్సభ సెక్రటరీ జనరల్ బుధవారం వెల్లడించారు. కమిటీలో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులను నియమించాల్సి ఉండగా 18 మంది పేర్లను ప్రకటించారు. మరో ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉందని పేర్కొన్నారు.