Shock to YS Jagan: పొదిలిలో వైఎస్ జగన్కు నిరసన సెగ
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:51 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకు వచ్చారు. అక్కడ పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్కు నిరసన సెగ తగిలింది.

ప్రకాశం జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) బుధవారం నాడు ప్రకాశం జిల్లా (Prakasam Dist) పొదిలి పర్యటనకు (Pidili Visit) వెళ్లారు. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా జగన్కు నిరసన (Protest) సెగ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిలిలో అడుగడుగునా నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్కు తీవ్రగాయాలు అయ్యాయి. కాగా, బుధవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్ 11 గంటలకు పొదిలి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లారు.
చర్యలు తీసుకోవాలి...
కాగా, రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడిన సాక్షి ఛానల్, పేపర్ను మూసివేయించాలంటూ బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ మహిళలు నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు. అనంతరం కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ సాక్షి ఛానల్ రిపోర్టర్ కొమ్మినేని, జర్నలిస్టు కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిగ్గుచేటు..
మహిళలను అవమానపరిచేలా మాట్లాడినప్పటికీ ఆ ఛానల్ ఎండీ భారతిరెడ్డి ఖండించడం గానీ, క్షమాపణ చెప్పడం గానీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలంటే గౌరవం లేకే జగన్రెడ్డి తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని మహిళలు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో కంభం టౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆరేపల్లి సుభాషిని, అర్ధవీడు మండల నాయకురాలు కత్తి భారతి, పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ నక్షత్రం చాలా పవిత్రమైన రోజు..
విచారణలో కాకాణి అక్రమాలు వెలుగులోకి..
For More AP News and Telugu News