Minister DBV Swamy: వైసీపీ ధర్నాలు సరికాదు..
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:27 PM
Minister DBV Swamy:ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి మహిళలకు శుభవార్త చెప్పారు.

ప్రకాశం జిల్లా: ఏపీ (AP)లో అరాచక పాలనను (YCP Slams) ప్రజలు తరిమికొట్టి (People Rejected) సరైన తీర్పు వచ్చిన రోజు జూన్ 4 (June 4 th) అని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా ప్రజలు తరిమికొట్టారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం మంత్రి ప్రకాశం (Prakasam)లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ప్రజల తీర్పు జీర్ణించుకోలేక జూన్ 4 వెన్నుపోటు దినంగా చెబుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు.
ప్రజల మీద వైసీపీ ధర్నాలు సరికాదు..
ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరినీ తాము వేధించడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని మంత్రి అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తరిమికొడితే... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరిగి పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు. జగన్ పక్కన ఉన్న 11 మంది కూడా మిగిలే పరిస్థితి లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి జోష్యం చెప్పారు.
Also Read: పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తొలగించం..
కాగా గ్రామ, వార్డు సచివాలయాలను రేషనలైజేషన్లో మూడు కేటగిరీలుగా విభజన చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈ విషయంపై చాలామంది సిబ్బందిలో అపోహలున్నాయని.. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించమని ఆయన వారం రోజుల క్రితమే పేర్కొన్న విషయం తెలిసిందే. ఉద్యోగుల మధ్య పని విభజనపై కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చామన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అవసరాన్ని బట్టి ఉద్యోగుల బదిలీలు చేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బదిలీల ప్రక్రియ మాదిరిగా వారి బదిలీలు ఉండవని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుర్తుచేశారు.
ప్రతి ఎస్సీ కుటుంబానికి లబ్ది..
రేషనలైజేషన్ వల్ల పని భారం తగ్గుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. సచివాలయాల సంఖ్య పెరుగుతాయి... అంతే గాని తగ్గించమని స్పష్టం చేశారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి లబ్ధి జరుగుతుందని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వందశాతం ఎస్సీలకే వినియోగించాలని సూచించారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించారు. ఎస్సీల విద్య, వైద్యం ఆరోగ్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడారు. నోడల్ ఏజెన్సీ అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీల ఆర్థిక, సామాజిక రాజకీయ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..
శ్రీవారి ఆలయంపై మరోసారి వెళ్ళిన విమానం
For More AP News and Telugu News