Rajya Sabha Election: రాజ్యసభ సభ్యుడిగా పాకా ఎన్నిక ఏకగ్రీవం
ABN , Publish Date - May 06 , 2025 | 05:18 AM
రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, ఈ ఎన్నికకు ఒకే నామినేషన్ మాత్రమే చెల్లుబాటయ్యింది.

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడిగా కూటమి అభ్యర్థి, బీజేపీ తరఫున పోటీ చేసిన పాక వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం ఈమేరకు రిటర్నింగ్ అధికారి వనితా రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఒక నామినేషన్ మాత్రమే చెల్లుబాటయ్యింది.