Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు
ABN , Publish Date - May 14 , 2025 | 09:09 AM
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

VIP Break Darshan: టీటీడీ భక్తులకు (TTD Devotees) శుభవార్త (Good News). తిరుమల (Tirumala)లో గురువారం (15వ తేదీ) నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు (Break Darshan) పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy)తెలిపారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో మరికొందరు భక్తులకు ఊరట దక్కనుంది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
Also Read: వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..
ప్రతి వేసవిలో తిరుమలలో భారీగా రద్దీ ఉంటుంది. అందరికీ సెలవులు కావడంతో భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతుంటారు. ఈ క్రమంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, త్వరగా దర్శనం కల్పించేందుకు టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తుంటుంది. ఇందులో భాగంగా మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళల్ని మార్చింది. ఉదయం వేళ ఉండే ప్రోటోకాల్ దర్శనం, రిఫరల్ ప్రోటోకాల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా సామాన్య భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జూలై 15 వరకూ సిఫార్సు లేఖల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ ముగిసిన తరువాతే సిఫారసు లేఖల్ని పునరుద్ధరించనున్నారు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయంలో టీటీడీ నిర్ణయం మార్చుకుంది. వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ నేతల్నించి వస్తున్న విజ్ఞప్తుల మేరకు టీటీడీ సిఫారసు లేఖల్ని తిరిగి ప్రారంభించదల్చింది. జూలై 15 వరకూ రద్దు చేసిన సిఫారసు లేఖల్ని తిరిగి పునరుద్ధరిస్తోంది. మే 15 నుంచి (గురువారం) ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల్ని స్వీకరిస్తామని మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..
For More AP News and Telugu News