Somireddy Slams Jagan: ఆ ఘనత జగన్కే సొంతం... సోమిరెడ్డి సెటైర్
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:22 PM
Somireddy Slams Jagan: కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి.. అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్కు లేదన్నారు.

నెల్లూరు, జూన్ 4: గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) అక్రమ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (బుధవారం) జిల్లాలోని రైల్వే కోర్టుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తన మీద 18 కేసులు పెట్టారని.. సంబంధం లేని కేసులో ముద్దాయిగా కోర్టుకు హాజరయ్యానని అన్నారు. వైఎస్సార్, జనార్దన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా తనపై మీద కేసులు నమోదు కాలేదని తెలిపారు. రూ.43 వేల కోట్ల అక్రమస్తుల కేసులో జగన్ ముద్దాయి అని.. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారని ఆరోపించారు.
కాంగ్రెస్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించి.. అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని.. వెన్నుపోటు దినోత్సవం జరుపుకునే అర్హత జగన్కు లేదన్నారు. రాష్టాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్ ది అంటూ వ్యాఖ్యలు చేశారు. హెడ్ కానిస్టేబుల్ను చంపబోయిన రౌడీ షీటర్ను జగన్ పరామర్శించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. దొంగల పార్టీగా వైస్సార్సీపీకి పేరు మార్చుకోవాలంటూ హితవుపలికారు. మాస్క్లు అడిగిన సుధాకర్ చనిపోతే.. ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదని.. ఎమ్మెల్సీ అనంతబాబూ డ్రైవర్ను చంపితే పరామర్శకు పోలేదన్నారు. జూన్ 4న రాష్టానికి స్వాతంత్రం వచ్చిందని.. ప్రజాస్వామ్యం బతికిన రోజూ అంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అరాచక శక్తులకు జగన్ మద్దతు: కన్నా
మరోవైపు మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ (MLA Kanna Laxminarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాక్షస ,అరాచక పాలన సాగిందన్నారు. వైసీపీ పాలనలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురుచుశారని.. జరిగిన ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పారని తెలిపారు. కూటమి ప్రభుత్వం లో ప్రజాస్వామ్య పాలన జరుగుతోందన్నారు. తెనాలిలో అరాచక శక్తులను మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. గతంలో పరామర్శకు వెళ్లిన లోకేష్పై వైసీపీ వాళ్లు దాడి చేశారని గుర్తుచేశారు. అరాచక శక్తులకు జగన్ మద్దతు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం ఆర్దిక సంక్షోభం లో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కొండమోడు..పేరెచర్ల రహదారి పనులు ప్రారంభించామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ,సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. అమరావతి రాజధాని రావటంతో భూములు విలువ పెరిగిందని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు
వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్
Read Latest AP News And Telugu News