Share News

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి

ABN , Publish Date - Jun 09 , 2025 | 10:01 AM

YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.

YCP: పోలీసుల విచారణకు సహకరించని కాకాణి
Kakaani Govardhan Reddy

Nellore Dist: వైసీపీ సీనియర్ నేత (YCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Ex Minister Kakaani Govardhan Reddy)పై మరో కేసు (New Case) నమోదైంది. కృష్ణపట్నం పోర్ట్‌కు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గెట్ ఏర్పాటు చేసి, కంటైనర్ లారీల నుంచి అక్రమ వసూళ్ళకు (Illegal Toll Collection) పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ముత్తుకూరు పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. మూడు రోజుల కస్టడీలో పోలీసుల విచారణకు కాకాణి సహకరించలేదని తెలియవచ్చింది. దీంతో అతని బెయిల్ పిటిషన్ కొట్టివేసి, మరోసారి కస్టడీకి పోలీసులు కోరనున్నారు. కాగా మాజీ మంత్రి కాకాణి క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.


కేసుల పరంపర..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణితో పాటు మరికొందరు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. తొలుత అక్రమ గ్రావెల్ తరలింపు, ఆ తర్వాత టోల్ వసూళ్ల దుర్వినియోగంపై నమోదైన ఈ కేసులతో కాకాణిపై వివాదాలు చర్చనీయాంశమవుతున్నాయి.


విచారణకు సహకరించని కాకాణి..

కాగా అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణలో కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రిని న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు. తొలిరోజు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. దాదాపు 22 ప్రశ్నలను పోలీసులు సంధించగా.. విచారణకు కాకాణి అస్సలు సహకరించలేదని సమాచారం. తనకు సంబంధం లేదని, తనకు తెలీదని, న్యాయవాదిని అడగండి అంటూ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించగా.. శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించేందుకు నగదు ఎక్కడిదని, 63 వేల టన్నుల క్వార్ట్జ్‌ను కొల్లగొట్టడం ద్వారా వచ్చిన రూ.138 కోట్లు ఏం చేశారని, అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందని, ఎవరెవరికి ఎంత ముట్టింది అంటూ కాకాణిని ప్రశ్నించినట్లు సమాచారం. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరిగింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. రెండో రోజు 35 ప్రశ్నలు సంధించగా నోరు మెదపలేదు.. మూడోరోజు అయిదారు ప్రశ్నలు వేశారు.. వాటికీ సమాధానం లేదు.


మూడో రోజు కాకాణి విచారణ

మూడో రోజు (ఆదివారం) కాకాణిని రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల ముందు విచారించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయిదారు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వాటికి మౌనం తప్ప ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకు కాకాణి చెప్పారు. ఏ1, ఏ2, ఏ3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి వాంగ్మూలాన్ని వినిపించారు. ఎన్నిసార్లు అడిగినా తనకేమీ తెలియదని.. తనకు సంబంధం లేదన్న మాటే వినిపించింది. మరిచిపోయాను, తన న్యాయవాదితో మాట్లాడుకోండి అనే పదాలు మినహా మరోమాట రాలేదు.


ఇవి కూడా చదవండి:

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణకు హరీష్ రావు

రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదు..: మంత్రి లోకేష్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 09 , 2025 | 10:17 AM