Nara Lokesh: సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా?
ABN , Publish Date - Jun 14 , 2025 | 09:45 PM
తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు.

అమరావతి, జూన్ 14: తల్లికి వందనంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించి.. సవాల్ విసిరారు. అయితే సవాల్ గడువు ముగియడంతో మంత్రి నారా లోకేశ్ శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. కాస్తా ఘాటుగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! అంటూ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. బురద చల్లడం పారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం జగన్ రెడ్డి గారికి అలవాటన్నారు.
తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు నిరూపించాలని 24 గంటల ఛాలెంజ్ చేశానని పేర్కొన్నారు. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదని తెలిపారు. అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అనేదంటూ వ్యంగ్యంగా అన్నారు. లీగల్ యాక్షన్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండంటూ సవాల్ విసిరారు. సమయం లేదు మిత్రమా! శరణమా..న్యాయ సమరమా? తేల్చుకోండంటూ ముగించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. అందులోభాగంగా తాజాగా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు స్పందిస్తూ.. ఈ పథకంలో కొంత నగదు మంత్రి నారా లోకేశ్ ఖాతాలోకి వెళ్లాయంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ పైవిధంగా స్పందించారు.
ఇంతకీ వైసీపీ నేతలు ఏమన్నారంటే.. తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి అందులో రూ. 2 వేలు నారా లోకేశ్ ఖాతాలో పడ్డాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. దీనిని రుజవు చేయాలి.. లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు. అలా చేయకుంటే.. వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తనని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలని గతంలో మాదిరి భరించేది లేదని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వైసీపీ దుష్ప్రచార మూకల్ని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ అధికారికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి బెదిరింపులు..
మొదటి గద్దర్ అవార్డు ఎవరికో తెలుసా..?
For AndhraPradesh News And Telugu News