Share News

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:57 AM

గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..

Minister Satyakumar: లక్ష ప్రాంతాల్లో యోగాంధ్ర

  • 2 కోట్ల మందితో నిర్వహిస్తాం .. ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. డిజిటల్‌ ఆరోగ్య సేవలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచి సత్ఫలితాలు సాధించడం, రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు, వైద్య సిబ్బందిలో క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సిబ్బంది హాజరు 7.42ు నుంచి 14.20 శాతానికి పెరిగిందని తెలిపారు. ఓపీ సేవలు 8ు, ఐపీ సేవలు 17.61ు పెరిగాయని చెప్పారు. ఎన్‌హెచ్‌ఎం కింద 2024-25లో కూటమి ప్రభుత్వం 30కి పైగా పథకాలను అమలు చేసిన తీరు, సాధించిన ఫలితాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతిగా రూ.100 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలాంటి గుర్తింపు రాష్ట్రానికి లభించలేదన్నారు. 104 సంచార వైద్య వాహనాల ద్వారా ప్రజల ఇంటివద్దనే 47 రకాల వైద్య పరీక్షలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సర్వజనాస్పత్రులకు 3,200కు పైగా ఆధునిక పరికరాలు సమకూర్చామని, రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని మంత్రి పేర్కొన్నారు. వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్‌ జి.వీరపాండియన్‌ పాల్గొన్నారు.


  • కాకినాడలో 7 వేల మందితో యోగా

యోగాంధ్రలో భాగంగా కాకినాడ ప్రధాన రహదారిలో శనివారం ఏడు వేల మందితో యోగా నిర్వహించారు. పట్టణంలోని టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ సెంటర్‌ నుంచి ఎల్‌ఐసీ భవనం వరకు... కిలోమీటర్‌ మేర యోగాభ్యాసకులు ఆసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 03:59 AM