Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
ABN , Publish Date - May 13 , 2025 | 08:25 AM
Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్గా మారింది.

అమరావతి: ఇండియా (India), పాకిస్తాన్ (Pakistan)ల మధ్య యుద్ధం (War) తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్ఫైర్) (ceasefire). ఈ నేపథ్యంలో చాలా మంది రకరకాలుగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ (Tweet) వేదికగా పోస్టు చేశారు. ‘‘తిరువల్లువార్ 'తిరుక్కురల్' నుండి ఒక సారాంశం... ఎలుకలన్నీ జేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది... శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్మీ నశిస్తాయి’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Also Read: హైదరాబాద్లో సుందరీమణుల సందడి..
‘ఎలుకలన్నీ జేరి సముద్రము వలే, ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది.. శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్నీ నశిస్తాయి’. అనే పద్యాన్ని.. ఆర్మీని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇక ఈ పద్యానికి ఎస్ 400 మిస్సైల్కు సంబంధించిన ఫోటోను పెట్టారు. తమిళ కవి తిరువల్లూర్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పవణ్ కల్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News