Share News

Pawan Kalyan: త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వ్యక్తి ఎన్టీఆర్..

ABN , Publish Date - May 28 , 2025 | 02:06 PM

Pawan Kalyan: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర అజరామరం అని, చరిత్ర పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని, ఈ రోజు ఆ మహామనిషి, కళా ఋషి 102వ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

 Pawan Kalyan: త్రికరణ శుద్ధితో  కార్యాచరణ చేసిన వ్యక్తి ఎన్టీఆర్..
AP Deputy CM Pawan Kalyan

అమరావతి: దివంగత స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి (NTR 102nd birth anniversary) సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో (Telugu States) టీడీపీ నేతలు (TDP Leaders) ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు (Tribute). ఈ సందర్భంగా జనసేన అధినేత (Janasena Chief), ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చరిత్ర అజరామరం అని అన్నారు. త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యమైనా సత్ఫలాన్ని ఇస్తుందని తాను విశ్వసిస్తానని.. అటువంటి త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని అన్నారు. మనసు, మాట, కర్మ (పని) మూడు అంశాలు సమన్వయం చేసుకొంటూ పని చేయడం ఆయనలో తాను గమనించానని, అందుకే వేషం వేసినా, రాజకీయం ఆచరించినా, ప్రజాసేవ చేసినా ఎన్టీఆర్ సత్ఫలితాలను సాధించారని కొనియాడారు. నటుడిగా, రాజకీయ నేతగా, పరిపాలనాదక్షునిగా.. చరిత్ర పుటలు నుంచి చెరిపివేయలేని చరిత్ర ఆయనదని.. ఈరోజు ఆ మహామనిషి, కళా ఋషి జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: ‘పద్మశ్రీ’ ఉద్యమాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నా: మంద కృష్ణ


మహానాడు అన్న పదం విన్నా, చదివినా..

కాగా ‘మహానాడు అన్న పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని.. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది’ అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మహానాడు సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పక్షాన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్‌, బక్కని నరసింహులుకు శుభాభినందనలు. ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై చర్చించి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోటార్ బైక్‌లకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోండి: సీపీ

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ

For More AP News and Telugu News

Updated Date - May 28 , 2025 | 02:11 PM