Minister Lokesh: లోకేష్ను అభినందించిన అమిత్ షా.. ఎందుకంటే
ABN , Publish Date - Jun 18 , 2025 | 02:52 PM
Minister Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని లోకేష్ కోరారు.

న్యూఢిల్లీ , జూన్ 18: మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Union Minister Amit Shah) మంత్రి సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు కేంద్రమంత్రితో లోకేష్ చర్చించారు. ఇందులో భాగంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రమంత్రికి లోకేష్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్కు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. అనంతరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్తో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
కాగా.. ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ను మర్యాదపూర్వంగా కలిశారు మంత్రి లోకేష్. సుమారు గంటపాటు వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని ఉపరాష్ట్రపతిని మంత్రి లోకేష్ కోరారు. మంత్రితో పాటు ఉపరాష్ట్రపతిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి కలిశారు.
ఢిల్లీ పర్యటలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను మంత్రి లోకేష్ కలుస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్తో భేటీ అయిన మంత్రి.. ఈరోజు సాయంత్రం సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అవుతారు. అలాగే సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో మంత్రి లోకేష్ చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డికి మరో షాక్
నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News