Nadendla Manohar: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల స్టేట్గా ఏపీ.. ఇదే మా లక్ష్యం
ABN , Publish Date - May 30 , 2025 | 02:42 PM
Nadendla Manohar: ఏపీకి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు.

విజయవాడ, మే 30: తాను కూడా చార్టేడ్ అకౌంటెంట్ కావాలనుకుని ఆర్టికల్స్ కూడా చేశానని.. చివరకు పొలిటీషియన్ అయ్యానని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar). ఈరోజు (శుక్రవారం) ఐసీఏఐ జాతీయ విద్యార్దుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొన్ని లెక్కలకు సంబందించి ఆరు సంవత్సరాల తరువాత ఆడిటింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కలు ఇంకా ఆలస్యం కావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడుకైనా చార్టేడ్ అకౌంటెంట్ లేదా లాయర్ సహాయం తప్పనిసరని అన్నారు.
వ్యవసాయాదారిత దేశం టెక్నాలజీ ఆదారిత ఆర్థిక వ్యవస్థగా మారుతోందన్నారు. కొనుగోలు శక్తిలో మనదేశం జపాన్ను దాటేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి త్వరలో అంతర్జాతీయ కంపెనీలు, గ్లోబల్ చైన్లు రాబోతున్నాయన్నారు. ‘వాటికి మీ అవసరం ఉంది, ఈ ఏడాది చివరకు భారతదేశం నాలుగు ట్రిలియన్ డాలర్ల ఏకనామిగా మారుతుంది’ అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan kalyan) నాయకత్వంలో 2.4 ట్రిలియన్ డాలర్ల స్టేట్గా 2047 నాటికి ఏపీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా పంట కొనుగోలుకు అవకాశం ఇస్తే 74 వేల మంది రిజిస్ట్రార్ అయి 18 వేల మంది తమ పంటను పూర్తి స్ధాయిలో టెక్నాలజీని వాడుకుని అమ్మారన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రైతులు అమ్మిన ధాన్యం బస్తాలకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పీ4లో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడానికి కారణం వారు కూడా ఈ దేశాభివృద్దిలో తమ వంతు ప్రయత్నం చేస్తుండడమే అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News