Share News

Minister Dola: ఇకనైనా జగన్ కుట్ర పూరిత రాజకీయాలు మానుకోవాలి..

ABN , Publish Date - Jun 03 , 2025 | 10:19 AM

Minister Dola: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వు నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని.. ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

Minister Dola: ఇకనైనా జగన్ కుట్ర పూరిత రాజకీయాలు మానుకోవాలి..
Minister Dola Balaveeranjaneya Swamy

అమరావతి: వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) దళితులపై దాడులంటూ (Dalit issues) మొసలి కన్నీరు కారుస్తున్నారని.. దళితులను జగన్ దగా చేసిన చరిత్ర ఎవ్వరూ మర్చిపోలేరని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Balaveeranjaneya Swamy) అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దళితుల్ని అడ్డం పెట్టుకుని జగన్ చేసే కుట్ర పూరిత రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వు నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని.. ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అల్లరి మూకలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.


వైసీపీ ప్రజల తీర్పు జీర్ణించుకోలేక..

ఏపీలో అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి సరైన తీర్పు ఇచ్చిన రోజు జూన్ 4 అని, వైసీపీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా ప్రజలు తరిమికొట్టారని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ప్రకాశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పులో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని, ప్రజల తీర్పు జీర్ణించుకోలేక జూన్ 4 వెన్నుపోటు దినంగా చెబుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు పనులకు వెన్నుపోటు పొడవక కొనసాగిస్తారనుకోవడం వైసీపీ భ్రమ అని మంత్రి అన్నారు.


ఏ పథకం సక్రమంగా అమలు కాలేదు..

ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎవరినీ తాము వేధించడం లేదని, వైసీపీ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి వేధించారని మంత్రి విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు తరిమికొడితే... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో తిరిగి పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలు

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 10:19 AM