Liquor Scam Case.. నిందితులకు రిమాండ్ పొడిగింపు..
ABN , Publish Date - May 06 , 2025 | 12:30 PM
లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విజయవాడ: లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case)లో నలుగురూ నిందితులకు (Four Accused ) ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. (Remand Extended). ఈనెల 20వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తరలించారు. మంగళవారంతో రిమాండ్ ముగియడంతో కేసులో మిగతా ఇద్దరు నిందితులు అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి,పైలా దిలీప్లను మాత్రమే సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు అధికారులు తెలిపారు. దీంతో నలుగురు నిందితులకు ఈనెల 20వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఏపీ మద్యం కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఓ మాజీ ఎంపీని సిట్ అధికారులు ప్రశ్నించారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు.. సిట్ అధికారుల విచారణలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సోమవారం సిట్ అధికారులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, చాణక్యను వేరు వేరుగా ప్రశ్నించారు. ఈ విచారణలో మద్యం స్కామ్కు సంబంధించి పలు కీలక సమాచారం భయటపడింది. వివిధ సంస్థలను బినామీల పేరుతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నడిపించినట్లు తేలింది.
Also Read: అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ (ఫోటో గ్యాలరీ)
మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్ బ్యాచ్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. 7న (బుధవారం) ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని చెబుతూ.. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఎలా సాగింది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలియజేయాలని.. ఆ తరువాత 8న దీనిపై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు అయినా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనమైనా కలిగించాలంటూ ముగ్గురు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 7 వరకు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ధర్మాసనం. అరెస్ట్ చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా స్టేట్మెంట్ ఇవ్వాలని ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి, అధికారాల ప్రకారం కావాలంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చని.. ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ పార్థివాలా ఈ సందర్భంగా చెబుతూ.. తదుపరి విచారణ 8వ తేదీకి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సివిల్ డిఫెన్స్ డ్రిల్పై కీలక సమావేశం..
ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...
For More AP News and Telugu News