Nani vs chinni: మళ్లీ ప్రారంభమైన అన్నదమ్ముల సవాళ్లు..
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:35 PM
కేశినేని నాని చేసిన ట్వీట్కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

అమరావతి: విజయవాడలో అన్నదమ్ముల సవాళ్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. కేశినేని నాని, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. బుధవారం ఎంపీ చిన్నిపై ఎక్స్లో విమర్శలు చేస్తూ నాని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా సైకోలను పట్టించుకోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చిన్ని ట్వీట్ చేశారు. కేశినేని నాని ట్వీట్.. చిన్ని తన కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలన్నారు. చిన్ని చేయని అక్రమ దందాలు లేవని.. ఇసుక వ్యాపారం, ఫ్లెయాష్, గ్రావెల్, భూదందాలు, పేకాట గృహాలు నడిపించారని, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు చేశారని ఆరోపించారు. చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలని ప్రజల కోరిక అంటూ నాని ట్వీట్ చేశారు.
Also Read..: PM Modi: ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం..
నానికి చిన్ని కౌంటర్..
కేశినేని నాని చేసిన ట్వీట్కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని ట్వీట్ చేశారు.
కాగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. చిన్ని సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖలో ఏకంగా 60 ఎకరాలు పంపిణీ చేయడం ఏంటని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పేరును ఎంపీ చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మరోవైపు టీసీఎస్కు భూమి కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు. వైసీపీ తరపున విజయవాడ లోక్సభ స్థానానికి కేశినేని నాని.. తన తమ్ముడు కేశినేని చిన్నిపై పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా రాజకీయంగా చిన్నిపై విరుచుకుపడడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ హయంలో అభివృద్ధి.. జగన్ హయంలో విధ్వంసం..
తెలంగాణలో కలకలం రేపుతున్న కేసులు
నన్ను కూడా చంపండి అంటే మోదీకి చెప్పుకో అన్నారు
For More AP News and Telugu News