Bonda Uma: అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:20 PM
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

విజయవాడ: ఏడాది కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమంతో పాటు, రాష్ట్ర అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ఐదేళ్లుగా వైసీపీ (YCP) పాలనలో ప్రజలు విసిగిపోయి... 11 సీట్లకే వారిని పరిమితం చేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే (TDP MLA) బోండా ఉమ (Bonda Uma) అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడారు. కూటమిపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రణాళిక బద్దంగా పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ది పనులు కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు.
వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం..
గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. చెప్పిన విధంగా పెన్షన్ పెంచి.. ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటింటికి తీసుకువెళ్లి అందిస్తున్నామని చెప్పారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి నింపుతూ.. వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నామని, ప్రతి మహిళకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.
అక్కా చెల్లెళ్లకు త్వరలో 18వేలు..
గతంలో అమ్మ ఒడిని అర్థ ఒడిని చేసిన వైసీపీని ప్రజలు ఓడించారని, గురువారం నుంచి అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి రూ. 15 వేలు చొప్పున ఖాతాల్లో వేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగష్టు 15వ తేదీ నుంచి అమలు చేయనున్నామని చెప్పారు. అక్కా చెల్లెళ్లకు త్వరలో రూ. 18 వేలు కూడా అందజేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను విడతల వారీగా అమల్లోకి తెచ్చామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చే సరికి ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, చంద్రబాబు వంటి సమర్ధవంతమైన నాయకత్వంలో ప్రణాళిక బద్దంగా ముందుకు వెళుతున్నారని చెప్పారు. తొలి యేడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళుతున్నామని, వచ్చే నాలుగేళ్లల్లో కూడా ఏపీ ఆదర్శంగా నిలిచేలా అబివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలకు జవాబుదారీ తనంతో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్తగా నేటి నుంచి వితంతు పెన్షన్లను కూడా అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
తల్లికి వందనం పథకానికి జీవో జారీ
For More AP News and Telugu News