AP Govt: ఆ ఘటనతో షాక్కు గురైన భక్తులు.. స్పందించిన సర్కార్
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:20 AM
AP Govt: శేషాచలం అడవుల్లో కాలినడక వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి ఘటనపై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. అటవీ ప్రాంతంలో కాలినడక వెళ్లే భక్తుల కోసం పలు చర్యలు తీసుకుంది సర్కార్.

అమరావతి, ఫిబ్రవరి 25: శ్రీశైలంలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని రెండు రోజుల ముందు నుంచే లక్షలాది మంది భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు. మరికొందరు భక్తులు శేషాచలం అడవుల్లో నుంచి నడకమార్గంలో శ్రీశైలం చేరుకుని ఆ మహాశివుడిని దర్శించుకుంటారు. కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. అయితే నడకమార్గంలో భక్తులకు షాక్ గురిచేసేలా ఈరోజు (మంగళవారం) ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం క్షేత్రానికి బయలుదేరిన కొంతమంది భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసిన వార్త భక్తులను భయాందోళనకు గురి చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం ఏనుగుల దాడి ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది.
శ్రీశైల క్షేత్రంలో ఉత్సవాల నేపథ్యంలో అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతాల్లోని శివాలయాల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలినడకతో కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం పోలీస్ శాఖ అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని హోంమంత్రి అని దిశా నిర్దేశం చేశారు.
విషాద ఘటన
శ్రీశైలం వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు అడవి మార్గంలో శ్రీశైలంకు బయలుదేరిన భక్తులపై ఓబులవారిపల్లె మండలం గుండాలకోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏడుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే తమ ప్రాణాలను రక్షించుకునేందుకు భక్తులు తీశారు. అయినప్పటికీ ఏనుగులు వారి వెంట పడి మరీ ప్రాణాలు తీశాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు. ఏనుగులు గుంపు దాడితో నడకదారిన వెళ్తున్న భక్తులు ఒకింత షాక్కు గురయ్యారు.
సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
ఏనుగుల దాడిలో నలుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు డిప్యూటీ సీఎం పవన్. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. భక్తులు మృతి చెందడంపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!
ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..
Read Latest AP News And Telugu News