Share News

AP Cabinet Meeting: ఏపీ రాజధాని అమరావతి.. కేబినెట్ తీర్మానం

ABN , Publish Date - May 08 , 2025 | 02:30 PM

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిగా తీర్మానం చేసింది కేబినెట్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.

AP Cabinet Meeting: ఏపీ రాజధాని అమరావతి.. కేబినెట్ తీర్మానం
AP Cabinet Meeting

అమరావతి, మే 8: ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈరోజు (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) ఏపీ కేబినెట్ అభినందలు తెలియజేసింది. ప్రధాని, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది. క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్‌గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.


2014 పునర్విభజన చట్టంలో రాజధాని అమరాతి అని లేదని.. ఒకసారి పునర్విభజన చట్టంలో రాజధాని అమరావతి అని నిర్ణయిస్తే రాజధానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందని పలువురు న్యాయనిపుణులతో పాటు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన రైతులు కూడా సూచించారు. ఈ క్రమంలో రాజధాని అమరావతిగా నిర్ణయించి కేబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. 2014 పునర్విభజన చట్టాన్ని కేంద్రంలో ఉన్న ఉభయసభలు ఆమోదించాయి. అందువల్ల వాటికి చట్టసవరణ చేయాలి అంటే రాజ్యసభ, లోకసభ చేయాల్సి ఉండటంతో ఏపీ రాజధాని అమరావతి అని పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానంలో కేంద్రాన్ని అభ్యర్థించారు.


దీనికి సంబంధించి వెంటనే ఢిల్లీలోని ఎంపీలతో మాట్లాడి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించేలా చూడాలని నిర్ణయించారు. అందువల్లే ఈరోజే కేబినెట్‌లో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనితో పాటు మరో అంశంపై కూడా ఏపీ కేబినెట్‌లో చర్చించారు. ఏపీలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపు, రాజధాని అమరావతిలో ఇటీవల కాలంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో భూముల కేటాయింపుపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ ప్రాజెక్ట్ వలన ఎంతో ఉపయోగం ఉందని మంత్రులకు ముఖ్యమంత్రి వివరించారు.


ఆపరేషన్ సిందూర్‌కు అభినందనలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఏపీ కేబినెట్‌ అభినందనలు తెలియజేసింది. సిందూర్‌ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్‌ చేశారని ఈ సందర్భంగా సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


ఇవి కూడా చదవండి

AP Liquor Scam Supreme Court: ఏపీ లిక్కర్ స్కాం.. ఆ ముగ్గురికి సుప్రీంలో ఎదురుదెబ్బ

Pawan Viral Tweet: ప్రధాని మోదీపై పవన్ సంచలన ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 03:22 PM