Share News

CM Chandrababu: కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:43 AM

CM Chandrababu: ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నామన్నారు.

CM Chandrababu: కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్
CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 11: కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకుందన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తొలి అడుగు ప్రజల్లో భరోసాను కలిగించిందని.. మలి అడుగు కూడా విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ సీఎం పోస్ట్ చేశారు.


చంద్రబాబు ట్వీట్ ఇదే..

‘సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవలో, పెన్షన్లు, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డీఎస్సీతో టీచర్ ఉద్యోగాలు.. పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది... మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.


చెయ్యాల్సింది ఎంతో ఉంది: లోకేష్

lokesh-mangalagiri.jpg

అలాగే మంత్రి నారా లోకేష్‌ కూడా ప్రజా పాలనకు నేటితో ఏడాది పూర్తి సందర్భంగా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తైందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదని.. చెయ్యాల్సింది ఎంతో ఉందన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ప్రజాసేవలో నిమగ్నమవుతామని.. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

హనీమూన్ హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. సోనమ్ లవర్ రాజ్ కాదా..

కవితను పలకరించని కేసీఆర్‌!

Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 11:45 AM